సందట్లో సడేమియా.. వైసీపీ ఎమెల్యే జేబులో నుండి 30 వెయిలు గోవిందా..!

Update: 2019-06-15 10:55 GMT

దొంగలకు మాములు జనాలు విఐపీలు అని తేడా లేకుండా పోయింది .. ఎక్కడ పడితే అక్కడ ఎవరి దగ్గర పడితే వారి దగ్గరే తమ చేతి వాటం చూపిస్తున్నారు .. తాజాగా సందట్లో సడేమియా అన్నట్టుగా ఓ దొంగ వైసీపీ ఎమెల్యే జేబులో నుండి 30 వెయిలు కొట్టేసాడు.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన తలారి వెంకట్రావు ద్వారక తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యేను పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఎమ్మెల్యే వారితో కరచాలనం చేశారు. ఈ క్రమంలోనే ఆయన జేబులోని రూ.30 వేల నగదును దొంగ కొట్టేశాడని తెలుస్తోంది.

Tags:    

Similar News