పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ నిర్వహించిన వైమానిక దాడులను ఆప్ఘనిస్తాన్ స్వాగతించింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన దాడులను స్వాగతిస్తూ ఆప్ఘన్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా ఉగ్ర బాధితులమేనన్న ఆప్ఘనిస్తాన్ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి నిత్యం మద్దతుగా నిలుస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ లోని బాలాకోట్లో దాడి చేసినందుకు భారత్కు కృతజ్ఞతలు తెలిపింది. కేవలం ఈ దాడి ఉగ్రవాదంపై పోరుగానే చూడాలని అఫ్ఘన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి వెల్లడించారు.