స్థానిక కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధులను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఇవాళే అభ్యర్ధులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. పార్టీ ముఖ్యనేతలతోపాటు రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల లీడర్లతో చర్చించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్ధులను దాదాపు ఖరారు చేశారు. ముఖ్యంగా నల్గొండ బరి నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మీరెడ్డిని పోటీకి దింపాలని నిర్ణయించారు, అలాగే వరంగల్ స్థానం నుంచి ఇనుగాల వెంకట్రామిరెడ్డిని బరిలోకి దింపుతున్నారు. అయితే రంగారెడ్డి అభ్యర్ధిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి, రంగారెడ్డి అభ్యర్ధిగా మల్రెడ్డి రంగారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.