కేంద్ర ఎన్నికల సంఘం తనకిచ్చన నోటీసుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. వివరణ లేఖను రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్కు టీఆర్ఎస్ నాయకులు అందించారు. కేసీఆర్ ఇచ్చిన వివరణ లేఖను ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ రాంచందర్ రావు కలసి రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ జ్యోతిబుద్ధ ప్రకాష్కు అందజేశారు. కరీంనగర్ ఎన్నికల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపర్చే విధంగా ఉన్నాయంటూ వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. దీంతో కేసీఆర్ తన వివరణను టీఆర్ఎస్ నాయకుల ద్వారా అందజేశారు.