తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనం కావడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. మండలిలో కాంగ్రెస్ విలీనాన్ని రద్దు చేయాలంటూ ఇద్దరు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో విలీనాన్ని ఆమోదిస్తూ రిలీజ్ చేసిన బులెటిన్ నెంబర్-9ను రద్దు చేయాలని కోరారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మండలి ఛైర్మన్, అసెంబ్లీ లా సెక్రటరీ, సీఎస్తోపాటు ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, దామోదర్రెడ్డి, ఆకుల లలిత, సంతోష్కుమార్ నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని గతంలో కాంగ్రెస్కు చెందిన ఈ నలుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి అప్పటి ఛైర్మన్ స్వామిగౌడ్కు లేఖ ఇవ్వగా దాన్ని ఆమోదించారు. విలీనాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు మల్లేశ్వరరావు, బాలాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.