తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ ఘర్షణ...టీడీపీ కార్యకర్త మృతి

Update: 2019-04-11 07:18 GMT

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 197 పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో టీడీపీ కార్యకర్త సిద్దా భాస్కర్ రెడ్డి మృతి చెందారు. నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 

Similar News