నూటికి వెయ్యి శాతం టీడీపీ గెలుపు ఖాయమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీని గెలిపించేందుకు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వేలాది మంది వచ్చారన్నారు. తాను ఓటెయ్యమని పిలుపునిస్తే లక్షలాది మంది తరలి వచ్చారని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కమిషన్, ఈవీఎంలపై మరోసారి విమర్శలు గుప్పించిన చంద్రబాబు తన పోరాటంతోనే వీవీ ప్యాట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీవీ ప్యాట్ల ద్వారా వచ్చే స్లిప్పులను బాక్స్లో వేసేలా ఈసీ చర్యలు చేపట్టాలని బాబు డిమాండ్ చేశారు .