సోషల్ మీడియాలో కేశినేని నాని మరో ఆసక్తికర పోస్ట్

Update: 2019-06-10 06:46 GMT

ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రవర్తిస్తున్న తీరుతో సొంత పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. అసలు ఆయన ఎందుకిలా ప్రవరిస్తున్నారో అర్థం కాక చెవులు కొరుకుంటున్నారు. ఫేస్‌బుక్ వేదికగా రోజుకో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పలు పోస్ట్‌లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మారగా తాజాగా మరో షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఫేస్‌బుక్ వేదికగా మంత్రి కొడాలి నానిపై టీడీపీ కేశినేని సంచలన పోస్ట్ పెట్టారు. ఈ సారి నేరుగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావును టార్గెట్ చేశారు. కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలని కేశినేని నాని షాకింగ్ పోస్ట్ చేశారు. ఓవైపు దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూనే మరోవైపు కొడాలి నానిపై సెటైర్లు వేశారు. తన సమీప బంధువు దేవినేని అవినాష్‌కి గుడివాడ టికెట్‌ ఇవ్వడం వల్లే కొడాలి నాని విజయం నల్లేరుపై నడకైందన్న పోస్ట్ ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 




 


Tags:    

Similar News