ఇప్పటికే చంద్రబాబు వర్సస్ కేసీఆర్ రిటన్ గిఫ్ట్స్లు ఇస్తామని ఒకరిపై మరోకరు సవాల్కు ప్రతిసవాల్ విసురుకుంటున్న విషయం తెలిసిందే కాగా ఇటివల వైసీపీ పార్టీని వీడి టీడీపీ తీర్థంపుచ్చకున్న చీరాల మాజీ వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎడం బాలజీ సంచలన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరిచారు. వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రిటన్ గిఫ్ట్ ఇవ్వాలన్నారు. అయితే వంగవీటీ రాధా టీడీపీ గూటీకి చేరుతున్న వేళ మాట్లాడిన ఎడం బాలజీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. తొమ్మిదేళ్లు వైసీపీ పార్టీకోసం అణక్షణం కష్టపడి పనిచేశాన్నారు. కానీ వైసీపీ అధినేత వైయస్ జగన్ మాత్రం తనతో ఒక్క ముచ్చట కూడా చెప్పకుండా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను వైసీపీ పార్టీలో చేర్చుకున్నారని బాలజీ ఆరోపించారు. అయితే తప్పకుండా ఆమంచిని చీరాలలో చిత్తుచిత్తుగా ఓడించి తీరాలన్నారు. కాగా ఆమంచి కృష్ణమోహన్ ఆగడాలు తట్టుకోలేకనే గతంలో వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పానని ఈ సందర్భంగా బాలజీ గుర్తుచేశారు.
అయితే ఆమంచి పార్టీలో చేరిన విషయంపై జగన్ స్వయంగా జగన్ మోహన్ రెడ్డికి గతంలోనే బహిరంగ లేక రాశానని అన్నారు. ఆమంచి లాంటి పెద్ద రౌడీ షిటర్ని పార్టీలో చేర్చుకుకోవద్దని మోత్తుకున్న కానీ జగన్ మోహన్ రెడ్డి వినలేదని బాలజీ తీవ్రంగా విమర్శించారు. వైసీపీ అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన బాలజీ మళ్లీ 2019ఎన్నికల్లో పోటీకి దిగి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు బాలజీ. మరి జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించి నిజంగానే రిటన్ గిఫ్ట్ ఇస్తారా లేదా అన్నది అందరిని కలవరపెడుతోంది. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.