మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన టీఆర్ఎస్లో చేరుతున్నట్లు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉగాది పర్వదినాన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మండవతో పాటు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వద్దిరాజు రవిచంద్ర కూడా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం సీఎం కేసీఆర్ స్వయంగా మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.