మే 23 తర్వాత ఆ పార్టీ ఉండదు: బుద్దా వెంకన్న జోస్యం

Update: 2019-04-28 09:20 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలా దోచుకోవాలో నేర్పి, జగన్‌ను జైలుకు పంపించిన ఘనత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిదేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆదివారం విజయవాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ లక్ష కోట్లు దోచుకోవడానికి దారి చూపిన వ్యక్తి విజయసాయిరెడ్డిని అన్నారు. ఇక మే 23 తర్వాత వైసీపీ కనుమరుగవుతుందని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. అలాగే మే23 తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చంచల్‌గూడ జైలుకు వెళ్తారని చెప్పారు. బీజేపీ దర్శకత్వంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని బుద్దా ఆరోపించారు. విజయసాయివల్ల జగన్‌కు నష్టమే తప్ప లాభం లేదని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారి వస్తువులపై విజయసాయిరెడ్డి కన్నుపడిందని ఆమన ఆరోపించారు. అందుకే శ్రీవారి వస్తువులు చేజారిపోయాయని గగ్గోలు పెడుతున్నారని అన్నారు. 

Similar News