టీడీపీకి మరో షాక్..!

Update: 2019-03-05 11:06 GMT

టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ పార్టీ అధ్యక్షులతో సమావేశమైన మోదుగుల టిడిపిలో తనకు జరిగిన అవమానాలను కార్యకర్తలతో చెప్పుకుని కన్నింటి పర్యంతమయ్యారు. తనకు గౌరవం లేని చోట ఉండలేనని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఫోన్ చేస్తారేమోనని ఎదురుచూశానని, అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందే పార్టీ వీడుతున్నట్లు డివిజన్ అధ్యక్షులకు మోదుగుల తేల్చి చెప్పారు. చివరి సారిగా డివిజన్ పార్టీ అధ్యక్షులతో ఆయన గ్రూపు ఫోటోలు దిగారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీగా మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News