టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో మంగళవారం టీడీఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. అలాగే ఎన్నికల్లో ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై కూడా ఎమ్మెల్యేలతో కీలక చర్చ జరుపుతున్నారు. అలాగే సాయంత్రం ఎమ్మెల్సీలు, రేపు ఉదయం ఎంపీలతో చంద్రబాబు సమావేశం అవుతారు.
ఇక మరో వైపు రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వం తొలి శాసనసభా సమావేశాలు కావడంతో నిన్న రాత్రంతా మాక్ డ్రిల్ నిర్వహించారు. NSG, ఆక్టోపస్, అసెంబ్లీ భద్రతా సిబ్బంది ఈ మాక్డ్రిల్లో పాల్గొన్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటలా 30 నిమిషాల వరకు మాక్డ్రిల్ నిర్వహించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మాక్డ్రిల్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపు ఉదయం 11:05 నిమిషాలకు పార్రంభం కానున్నాయి.