తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తనను భారీ మోజారీటితో గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకనవుతానని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు ప్రతిఒక్కరు కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ యువనేతలు, మహిళా సోదరిమణులు అందరూ కలిసి ఏప్రిల్ 11 గురువారం ఉదయం 7 గంటలకే తీసుకువెళ్లి ఓటు వేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపడుచులు కూడా వారి మిత్రులు, బంధువులను అందరినీ పోలింగ్ బూత్కు తీసుకురావాలని పిలుపు ఇచ్చారు. తాను గెలిస్తే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతానని రేవంత్ అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతుకోసే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ మాయామాటలను ఎవరు కూడా నమ్మవద్దని తెలిపారు.