స్పెషల్ డీఎస్సీ పరీక్ష ఈ నెల 31న జరగాల్సి ఉండగా, జూన్ 19కి వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి ఒక పక్రటనలో తెలిపారు. ఆన్లైన్లో జరిగే ఈ పరీక్షకు 4,446 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు జూన్ 12 నుంచి cse.ap.gov.in నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషనర్ సూచించారు