వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగుతున్న సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని ఆమె కోర్టుకు విన్నవించారు. కాసేపట్లో ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ నాలుగు రోజుల క్రితం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు నెంబరింగ్ రాకపోవడంతో విచారణకు రాలేదు. దీంతో వివేకానంద సతీమణే స్వయంగా పిటిషన్ దాఖలు చేశారు.