చిత్తూరు జిల్లా ఎన్నికల ఈవీఎంలు భద్రపర్చిన ఎస్వీ సెట్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కాలేజీకి చెందిన రెండు ఏసీలు, నాలుగు కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. కౌంటింగ్కు రెండు రోజుల ముందు అగ్నిప్రమాదం సంభవించడంతో ఎన్నికల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈవీఎంలు భద్రపర్చిన గదులకు దూరంగా మంటలు చెలరేగడంతో ఊపిరిపీల్చుకున్నారు.