హైదరాబాద్ పంజాగుట్టలో కాల్పుల కలకలం రేగింది. ఫిలింగనగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో కాల్పులు జరిగాయి. బస్ దిగమన్నందుకు ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. సికింద్రాబాద్ నుంచి మణికొండ వెళుతున్న 47ఎల్ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నెంబర్ ఏపీ28జెడ్ 4468గా గుర్తించారు. బస్సు రూఫ్ టాప్ నుంచి బుల్లెట్ దూసుకెళ్లినట్టుగా చెబుతున్నారు. అయితే, బస్ డైవ్రర్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. బస్ ఎక్కడా నిలపకుండా నేరుగా పోలీస్స్టేషన్కు తరలించేందుకు వెళ్లినట్టు సమాచారం. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ డ్రెస్లో ఉన్నాడని ప్రయాణికులు తెలిపారు.