మధులికను పరామర్శించిన శిఖాగోయల్‌

Update: 2019-02-08 11:33 GMT

ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధులికను క్రైమ్ అడిషనల్‌ కమిషనర్‌ శిఖా గోయల్‌ పరామర్శించారు. బాలిక పరిస్థితిపై, అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు గోయల్‌ తెలిపారు. గతంలో కేవలం కౌన్సెలింగ్‌ కోసమే షీ టీమ్‌ను సంప్రదించారని తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు వివరించారు. విచారణ కొనసాగుతుందన్న శిఖా గోయల్‌ బాలిక త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 

Similar News