మాజీ బీఎస్ఎఫ్ జవాను ఈ ఎన్నికల బరిలో దిగిన విషయం తెలిసిందే. కాగా కాగా తేజ్ బహదూర్ యాదవ్కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. వారణాసి లోక్సభ నుంచి తేజ్ బహదూర్ వేసిన నామినేషన్ను ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా దినిపై తేజ్ బహదూర్ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. అయితే బహదూర్ యాదవ్ అభ్యర్థనను కూడా సుప్రీం తిరస్కరించింది. ఈ ఎన్నికల్లో భారత ప్రధాని నరేంద్రమోడీపై పోటీకి దిగారు. సమాజ్వాదీ పార్టీ తరపున తేజ్ బహదూర్ వారణాసి నుంచి నామినేషన్ వేశారు. అయితే సైన్యం నుంచి బహిష్కరణకు గురైన నేపథ్యంలో తేజ్ బహదూర్ నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దాన్ని సవాల్ చేస్తూ మాజీ జవాను సుప్రీంకు వెళ్లారు.