నా సస్పెన్షన్‌పై ఆంటోనీ ఆశ్చర్యపోయారు: సర్వే

కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ ఏకే ఆంటోనిని కలిశారు.

Update: 2019-01-10 12:04 GMT

కాంగ్రెస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ ఏకే ఆంటోనిని కలిశారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాపై చేసిన వ్యాఖ్యలకు ఆంటోనీ వివరణ కోరారని, తనని సస్పెండ్ చేయడం ఏమిటంటూ ఆయన ఆశ్చర్యపోయారని సర్వే చెప్పారు. ఉత్తమ్‌, కుంతియా తప్పిదాలను ఆంటోనీకి వివరించానన్నారు. ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో డబ్బులు దండుకుని పక్షపాతంగా వ్యవహరించారని సర్వే వ్యాఖ్యానించారు. ఆరోపణలన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆంటోనీ చెప్పారని సర్వే మీడియాకు తెలిపారు. 

Similar News