శిశువు కిడ్నాప్ మిస్టరీ వీడింది. రెండు రోజుల కిందట సంగారెడ్డి ఆసుపత్రిలో కిడ్నాపైన శిశువు ఆచూకీ కామారెడ్డి జిల్లాలో దొరికింది. కామారెడ్డి జిల్లా ఎల్లా రెడ్డి మండలం శివనగర్కు చెందిన బంగారు సంతోష్ అనే వ్యక్తి ఇంట్లో కిడ్నాపైన శిశువును పోలీసులు గుర్తించారు. వారి నుంచి శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు జాగ్రత్తగా సంగారెడ్డి తరలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం శివనగర్ గ్రామానికి చెందిన బంగారి శోభ-సంతోష్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి నుంచి పాపను ఎత్తుకెళ్లిన శోభ-సంతోష్లు బైక్పై సొంతూరుకి వెళ్లారు. అయితే సంతోష్-శోభ కోడలికి నిలోఫర్ ఆస్పత్రిలో పదిరోజులక్రితం డెలివరీ కాగా, పురిట్లోనే పాప మరణించింది. అయితే పాప మరణించిందనే సంగతి కోడలికి తెలియకూడదనుకున్న శోభ-సంతోష్లు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి నుంచి పాపను ఎత్తుకెళ్లి కోడలికి ఇఛ్చినట్లు విచారణలో తెలిపారని పోలీసులు చెప్పారు.