శబరిమల ఆలయ అర్చకుల అసాధారణ నిర్ణయం...మహిళలు ప్రవేశించడాన్ని...
శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన నేపధ్యంలో ఆలయ అర్చకులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.
శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన నేపధ్యంలో ఆలయ అర్చకులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఇరుముడులతో స్వామి వారి దర్శనానికి భక్తులు వచ్చే సమయంలో ఆలయాన్ని మూసివేశారు. మహిళలు గుడిలోకి ప్రవేశించిన కాసేపటికే గర్భగుడి నుంచి బయటకు వచ్చిన అర్చకులు తలుపులు మూసివేసి వెళ్లిపోయారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలకు తగిన భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆదేశించారు.