టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజం
కోడి కత్తి కేసు విచారణ ఎన్.ఐ.ఏ చేతికి వెళ్లడంతో టీడీపీ నాయకులకు భయం పట్టుకుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఈ కేసులో ఊచలు లెక్కపెట్టేందుకు టీడీపీ నాయకులకు సిద్ధంగా వుండాలని ఆమె హెచ్చరించారు.
కోడి కత్తి కేసు విచారణ ఎన్.ఐ.ఏ చేతికి వెళ్లడంతో టీడీపీ నాయకులకు భయం పట్టుకుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఈ కేసులో ఊచలు లెక్కపెట్టేందుకు టీడీపీ నాయకులకు సిద్ధంగా వుండాలని ఆమె హెచ్చరించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో రోజా మాట్లాడారు. నిన్నటి జగన్ సభకు జనంలేరని వ్యాఖ్యలు చేసిన మంత్రి సోమిరెడ్డి సభకు వచ్చి వుంటే జనం తొక్కేసి వుండేవారని చెప్పారు. ఐదు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి మంత్రి పదవి అనుభవిస్తున్నందుకు సిగ్గుపడాలన్నారు రోజా.