రేవంత్రెడ్డి కీలక నిర్ణయం
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇయర్ ఎండ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇయర్ ఎండ్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ తీసుకున్న నిర్ణయంతో అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇటివలే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి రేవంత్ రెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే కాగా అప్పటి నుంచి రేవంత్ రెడ్డి మీడియా సమావేశాలు నిర్వహించడమే బంద్ చేశాడు రేవంత్ రెడ్డి. ఇక గడిచిన ఎన్నికల్లో రేవంత్ ప్రసంగంతో గడగడ లాడించేవాడు, తనదైన శైలీలో విమర్శలు గుప్పించే రేవంత్ ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ గట్టిగ మాట్లాడే వారే కరువాయ్యారు. తాజాగా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల పాటు మీడియాతో మాట్లాడనని ప్రకటించారు. కొండంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రేవంత్ రెడ్డి రెండేళ్ల పాటు మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రేవంత్ నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్ఠానం, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాల్సిందే.