టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల తిరస్కరణ మొదలైందని, వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీరు కుంటి సాకులు చెబుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మీ పతనం మొదలైంది, సిద్ధిపేట, సిరిసిల్లలే మీ పతనానికి సంకేతాలు అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు భారీగా మెజారిటీ తగ్గిపోవడాన్ని రేవంత్ ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటే వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందని, ఈ వాస్తవాన్ని అంగీకరించలేని స్థితిలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని విమర్శించారు. కరీంగనర్, నిజామాబాద్లో టీఆర్ఎస్ నేతల ఓటమిపాలయ్యారని టీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందనడానికి ఇదే సంకేతమన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా వర్తమానంలో ప్రజల ఆదరణ ఎలా ఉందన్నదే ప్రామాణికమన్న రేవంత్ ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని ఐదేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలతో పోల్చుకోవడం మీ అతి తెలివికి నిదర్శనమంటూ కేటీఆర్ను ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు. మల్కాజ్గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారు. అవమానించేలా మాట్లాడటం మీ అహంకారానికి నిదర్శనం'' అని రేవంత్ లేఖలో ధ్వజమెత్తారు.