కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే నరేందర్రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్లో పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పట్నం నరేందర్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్ దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలనీ, అనర్హుడిగా ప్రకటించాలని కోర్టుకు కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పై పోటీచేసిన పట్నం నరేందర్ రెడ్డి 10,770 ఓట్ల మెజారిటీతో రేవంత్ పై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.