టీడీపీకి రాయపాటి షాక్ ఇస్తారా..?

Update: 2019-03-14 05:33 GMT

సీనియర్‌ నాయకుడు రాయపాటి సాంబశివరావు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు వైఖరిపై తీవ్ర అంసతృప్తిలో ఉన్నారు. టిక్కెట్‌ విషయంలో ఇప్పటికీ చంద్రబాబు నుంచి హామీ లభించకపోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీ స్థానంపై కూడా క్లారిటీ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ మారే యోచన చేస్తున్నారని ఆయన అనుచరులు వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్య అనుచరులతో చర్చించి త్వరలో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Similar News