కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో చెప్పేసిన రామ్ దేవ్ బాబా..

Update: 2019-06-19 15:23 GMT

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపి మంచి మెజారిటి సాధించి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది .. ఎన్నో ఆశలు పెట్టుకొని చాలా కష్టపడ్డ రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ చేతికిలపడింది .. అయితే కాంగ్రెస్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని పలువురు ఇప్పటికే అభిప్రాయపడ్డారు .. నాయకత్వ లోపం, ప్రభుత్వంపై వ్యతిరేకత అంత లేకపోవడం, శ్రేణుల్లో లోపించిన ఐకమత్యం, టికెట్ల కేటాయింపు .. ఇవి ఇప్పటి వరకు మనం విన్నా అంశాలు ..కానీ ఇవే మాత్రం కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణాలు కాదట .. !

కాంగ్రెస్ ఓటమికి కొత్త అర్ధం చెప్పారు రాందేబ్ బాబా..రాహుల్‌గాంధీ ఎప్పుడూ యోగ చేయకపోవడమే ఆయన పార్టీ అయిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయనికి కారణమని అయన చెప్పుకొచ్చారు .. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటారు .. మరో రెండు రోజుల్లో యోగా దినోత్సవం జరుగుతున్న సందర్భంలో భాగంగా రాం దేవ్ బాబా ఈ కామెంట్స్ చేసారు .. రాహుల్ యోగ చేయడం లేదని .. మోడీ మాత్రం ప్రజలతో కలిసి యోగా చేస్తున్నారని గుర్తుచేశారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కూడా తమ ఇంటిలో యోగా చేసేవారని గుర్తుచేశారు. కానీ వారి వారసుడు రాహుల్ మాత్రం యోగం చేయడం లేదని .. అందుకే అతనికి విజయం దక్కడం లేదని కుటుంబ నేతల విషయాన్ని కూడా ప్రస్తావించారు రాందేబ్ బాబా.. 

Tags:    

Similar News