ఈనెల 31న ఏపీలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ విడుదల

Update: 2019-05-26 12:29 GMT

ఎన్టీఆర్‌ చరమాంకంలో ఏం జరిగిందనే దానిపై,75 ఏళ్లు రాజుగా బతికిన ఎన్టీఆర్‌ చివరి దశలో నరకయాతన పడి మరణించారని, ఆ నరకయాతనకు గల కారణాలు ఏంటని అందరికి తెలియజేయాలనిపించి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా తీశామన్నారు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. ఏపీలో సినిమా విడుదలకు ఇబ్బందులు పెట్టారని, ఈనెల 31న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల చేస్తున్నట్టు వర్మ తెలిపారు. అయితే సైకిల్‌ చక్రం పంక్చర్‌ అయ్యిందని, తన నెక్ట్స్‌ సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని వివరించారు డాషింగ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ. ఎన్టీఆర్‌ వెనుక జరిగిన కుట్రలు భయటపెట్టడం మినహా ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు.ఈనెల 31 న లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమా ఏపీలో రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రెస్‌మీట్‌ నిర్వహించారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. 

Full View

Similar News