అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా: రాహుల్‌

Update: 2019-03-31 07:03 GMT

తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామన్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్‌ గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ భరోసా సభలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్ పార్లమెంట్‌లో ప్రకటించారన్నారు రాహుల్. గత ప్రధాని ఇచ్చిన హామీని మోదీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రధాని మోడీ వల్లే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాలేదన్నారు. బీజేపీ పాలనలో బ్యాంకుల నుంచి వేలాది కోట్లు తీసుకున్న శ్రీమంతులు దేశం విడిచిపోతుంటే సామాన్యుడి పరిస్ధితి మాత్రం రోజురోజుకు దిగజారుతోందన్నారు. దేశంలో పెరిగిపోతున్న పేదిరికంపై పోరాడుతానంటూ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏపీలో రైతు రుణమాఫీ అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. 

Similar News