సార్వత్రిక ఎన్నికల వేళ అటు దక్షిణాది నుంచి ఇటు ఉత్తరాది నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పార్టీ ఎన్నికల కమిటీ పచ్చ జెండా ఊపింది. ఈమేరకు రెండు స్ధానాలను ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్లోని అమేథితో పాటు కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. మూడో దశలో ఎన్నికలు జరగనున్న వయనాడ్ నియోజకవర్గానికి నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే నాలుగు వరకు సమయం ఉంది. మరోవైపు రాహుల్ కేరళ నుంచి పోటీ చేస్తున్నట్టు సీనియర్ నేత ఏకే ఆంటోని ప్రకటించారు. ఈ నేపధ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు సమాచారం.