జగన్ పాదయాత్రపై రఘువీరా సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పాదయాత్రపై ఏపీసీసీ రఘవీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.

Update: 2019-01-09 08:33 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన పాదయాత్రపై ఏపీసీసీ రఘవీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘవీరారెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రపై వైసీపీ చాలా గొప్పలు చెబుతోందన్నారు. అసలు జగన్ పాదయాత్రలో ఏముంది మహాఅయితే రోజుకు రూ. 2కోట్లు ఖర్చు తప్ప మరేమి లేదని రాఘవీరా రెడ్డి వ్యాఖ్యనించారు. ఇక పోతే పాదయాత్రలో అడుగడుగునా సెల్పీలు, నెత్తిమీద ముద్దులు తప్ప మరేమీ లేదని రాఘవీరా ఎద్దేవా చేశారు. టీడీపీతో పొత్తుపై తర్వగా తెల్చాలని అధిష్ఠానాన్ని కోరామన్నారు.

Similar News