మారుతీ రావు విడుదలకు బ్రేక్...

Update: 2019-04-27 15:13 GMT

ప్రణయ్ హత్యకేసు నిందితుల విడుదల ఆగిపోయింది. అయితే జైలు అధికారులకు ఇంకా బెయిల్ పేపర్లు అందకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అమృత తండ్రి మారుతీరావు (ఏ-1), బాబాయి శ్రవణ్‌కుమార్‌ (ఏ-5గా), అబ్దుల్‌ కరీం (ఏ-4)కు పీడీయాక్టు నమోదు చేశారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. శనివారం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కావాల్సిన నిందితులు సాంకేతిక కారణాల రీత్యా రేపు (ఆదివారం) విడుదల కానున్నారు.

Similar News