ప్రణయ్ హత్యకేసు నిందితుల విడుదల ఆగిపోయింది. అయితే జైలు అధికారులకు ఇంకా బెయిల్ పేపర్లు అందకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అమృత తండ్రి మారుతీరావు (ఏ-1), బాబాయి శ్రవణ్కుమార్ (ఏ-5గా), అబ్దుల్ కరీం (ఏ-4)కు పీడీయాక్టు నమోదు చేశారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. శనివారం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కావాల్సిన నిందితులు సాంకేతిక కారణాల రీత్యా రేపు (ఆదివారం) విడుదల కానున్నారు.