గురుగోవింద్ సింగ్ స్మారక నాణెం విడుదల చేసిన మోదీ
సిక్కు పరంపరంలో పదవ గురువు గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేన్ని ప్రధాన నరేంద్ర మోదీ విడుదల చేశారు.
సిక్కు పరంపరంలో పదవ గురువు గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేన్ని ప్రధాన నరేంద్ర మోదీ విడుదల చేశారు. లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సిక్కు నేతలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం హాజరయ్యారు. ఖల్సా పంథ్, ఐదు ప్యారాల ద్వారా దేశాన్ని సమక్యంగా ఉంచేందుకు గురుగోవింద్ సింగ్ చేసిన సేవలను ఆ సందర్భంగా మోదీ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017 జనవరి 5న పాట్నాలో జరిగిన గురుగోవింగ్ సింగ్ 350వ జయంత్యుత్సవాల్లోనూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా గురుగోవింద్ సింగ్ స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారు.