మోదీ ప్రమాణస్వీకారోత్సవాన్ని టీవీలో చూసి మురిసిన తల్లి హీరాబెన్

Update: 2019-05-31 01:58 GMT

మై నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ' అంటూ భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు మోదీ. తన కొడుకు దేశానికి రెండో సారి ప్రధాని కావడం చూసి ఎంతో ఆనందించింది ఆ తల్లి. మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తల్లి హీరాబెన్‌ టీవీలో వీక్షించి మురిసిపోయారు. రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడంపై మోడీ తల్లి ఆనందం పట్టలేకపోయారు. మోడీ ప్రమాణం చేస్తుండగా చప్పట్లు కొడుతూ సంతోషంలో మునిగితేలిపోయారు. గాంధీనగర్ రాయ్‌సన్ గ్రామంలో తన నివాసంలో మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని హీరాబెన్ వీక్షించారు. మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఫొటోలు ఇపుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.

Similar News