జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీలోని రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ రెండు స్థానాల్ పవన్ పోటీ చేయనున్నజనసేన అధికారికంగా ప్రకటించింది. పోటీ విషయంలో పవన్ తన సోదరుడు చిరంజీవి బాటను అనుసరిస్తున్నారనే చెప్పాలి. గతంలో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అధినేతగా రెండు చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు.
భీమవరం, గాజువాక స్థానాల నుంచి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ @PawanKalyan pic.twitter.com/SuTHdhDRok
— JanaSena Party (@JanaSenaParty) March 19, 2019