ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పవన్కల్యాణ్
విజయవాడలో జనసేనాని పవన్ కల్యాణ ఎన్నికల శంఖారావం పూరించారు. నేటి నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఏపీకి బంగారు భవిష్యత్ ఉండాలని అందుకోసం జనసేన పని చేస్తుందన్నారు పవన్ కల్యాణ్.
విజయవాడలో జనసేనాని పవన్ కల్యాణ ఎన్నికల శంఖారావం పూరించారు. నేటి నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఏపీకి బంగారు భవిష్యత్ ఉండాలని అందుకోసం జనసేన పని చేస్తుందన్నారు పవన్ కల్యాణ్. విజయవాడలో జనసేన పార్టీ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పలువురు నేతలు, అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ 2019 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగు ప్రజలకు తన తరపున, జనసైనికుల తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాని చెప్పారు. గడచిన ఏడాది అనుభవాలను ప్రేరణగా తీసుకొని నూతన నిర్ణయాలతో ముందడుగు వేద్దామన్నారు. ఈ కొత్త సంవత్సరంలో సామాన్యుడే రాజై వెలగాలని పేర్కొన్నారు. మానవీయ పాలనకు, నవ చరితకు ఇది శ్రీకారం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్కల్యాణ్ వెల్లడించారు.