కలుసుకున్న చంద్రబాబు, పవన్.. నవ్వుతూ ముచ్చట్లు..!

Update: 2019-04-20 08:54 GMT

ఏపీ సార్వత్రి ఎన్నికల వేళ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగిన నేతలు ఎదురెదురు పడిన వేళ నవ్వుతూ పలకరించుకున్నారు. అయితే వీరేఎవరనుకుంటున్నారా? టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల మహాయుద్ధం ముగిసిన తరువాత తొలిసారిగా కలుసుకున్నారు. అంతే కాదు ఒకరికొకరు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకొని సరదాగా కలిసి ముచ్చటించారు. అయితే వీరిద్దరి కలయికకు రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మనవరాలి వివాహం వేదికైంది. నేడు రామోజీరావు మనవరాలు కీర్తి సుహానా, నవయుగ గ్రూప్స్ చైర్మన్ సి. విశ్వేశ్వరరావు మనవడు వినయ్‌తో వివాహం జరిగింది. కాగా ఈ వివాహనికి నారా చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వీరి కలయికతో ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. గతేడాది అమరావతిలో జరిగిన ఓ ఆలయ విగ్రహ ప్రతిష్ఠలో కలుసుకున్న వీరిద్దరూ తిరిగి ఎదురుఎదురుగా కలుసుకోవడం ఇదే తొలిసారి. ఎన్నికలు ముగిసిన తర్వాత వీరిద్దరూ మరోసారి కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

Similar News