హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఓ మంత్రి అనుచరులు హంగామా సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే వైద్య సిబ్బందిపై నానా దుర్భాషలాడారు. అర్థరాత్రి యాక్సిడెంట్ అయిన వ్యక్తికి డాక్టర్లు వైద్య చికిత్స అందించడం లేదని వైద్యులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బంధువులు. ఎమర్జన్సీ వార్డులో చికిత్స్ అందిస్తున్న డాక్టర్పై చేయి చేసుకున్నారు. నువ్వు అసలు మనిషి వేనా? నిమ్స్లో డాక్టర్ను నిలదీసిన రోగి బంధువులు. పోలీసులు ఎదురుగానే డాక్టర్లను తిట్టి పోశారు. ఈ నేపథ్యంలో హంగామా సృష్టించిన వారిని పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఇప్పటి వరకు నిమ్స్ సిబ్బంది ఈ ఘటనపై ఫిర్యాదు చేయలేదు. నిమ్స్ సిబ్బంది నుంచి ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.