ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలు అయింది . ఈ ఓటమిని భారత్ క్రికెట్ ఫాన్స్ ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు .. మళ్ళీ ఇండియా కప్ కొట్టాలని కోరుకున్నా వారు అబ్బో లెక్కే లేదు . కానీ భారత్ సెమి ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవాలని కోరుకున్నానని అందుకోసం దేవుణ్ణి ప్రార్ధించాను అని అంతర్జాతీయ మతప్రబోధకుడు జాన్ వెస్లీ సోదరుడైన ఇమ్మాన్యుయేల్ అనే పాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్గా మారాయి.
This Pastor said, "India shouldn't reach the #CWC19Final I prayed the God" Later he clarified that, his comments r not intentional and apologized.
— Ravikumar T (@ravitedz) July 16, 2019
#PATRIOTIC #TeamIndia pic.twitter.com/noWg35fP6c
జూలై 14న విజయవాడలో క్రైస్ట్ టెంపుల్ వార్షికోత్సవ ఈవెంట్ను నిర్వహించారు. కానీ అదే రోజున వరల్డ్ కప్ ఫైనల్ ఉన్న సంగతి తెలిసిందే. దేవుడు మన పక్కన ఉన్నాడు. నా ప్రార్దన విన్నాడు అని ఇమ్మాన్యుయేల్ అన్నారు . ప్రస్తుతం దీనిపైన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు . అయితే దీనిపైన అయన స్పందిచారు .. "భారత్ ఓడిపోవాలనేది నా అభీష్టం కాదని అ రోజు 3.30 గంటల ప్రోగ్రాంలో ఒక్క నిమిషం ప్లోలో వచ్చిన మాటే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసిన మాట కాదని అ మాటలు మిమ్మల్ని నొప్పిస్తే క్షమించగలరని" అయన మరో వీడియో పోస్ట్ చేసారు .