ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. దీంతో రాజకీయ వలసలు ఊపందుకుంటున్నాయి. తాజాగా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (బాబ్జీ) మంగళవారం వైసీపీలో తీర్థంపుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో బాబ్జీ సమావేశం అయ్యారు. అనంతరం పార్టీలో చేరిన ఆయనను వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ పార్టీలో చేరిన అనంతరం బాబ్జీ మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ఒక యజ్ఞమని కొనియాడారు.