పంజాబ్లోని ఖేమ్ కరన్ సెక్టార్లో కనిపించిన పాకిస్తాన్ డ్రోన్ను బీఎస్ఎఫ్ బలగాలు కూల్చివేశాయి. భారత గగనతలంలో ఎగురుతున్న డ్రోన్ గుర్తించిన బలగాలు క్షణాల్లోనే దాన్ని కూల్చి వేశాయి. ఈ నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో హైలర్ట్ ను ప్రకటించారు. అయితే డ్రోన్ కూలిపోయినప్పటికీ అది భారత భూభాగంలో పడిపోయిందా? లేక పాక్ భూభాగంలో పడిపోయిందా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.