దాడి చేస్తారా...? మేము సిద్ధమే ‌: ఇమ్రాన్ ఖాన్

Update: 2019-02-19 08:52 GMT

పుల్వామా దాడితో తమకు సంబంధం లేదన్నారు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తామే ఉగ్రవాదుల బాధితులమని చెప్పారు. దాడి చేస్తారా మేమే సిద్ధమేనని అన్నారు ఇమ్రాన్. ఓ దేశం ఇలా చేసింది అలా చేసింది అని మరో దేశం ఎలా చెప్పగలుగుతుందని చెప్పారు. ఆరోపణలు కాదు ఆధారాలు చూపాలని సవాల్ చేశారు. ఓ దేశం, ఓ జాతి మీద అన్యాయంగా ముద్ర వేస్తారా అని ప్రశ్నించారు. ఇండియా వైపు నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ తిప్పికొడుతుందని చెప్పారు. యుద్ధం ప్రకటించడం, ప్రారంభించడం తేలికే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించాలని అన్నారు. సరిహద్దుల్లో ఇప్పుడిప్పుడే శాంతి, సామరస్యం నెలకొంటుందని చెప్పారు. పుల్వామా దాడి జరిగిన ఐదు రోజుల తర్వాత ఇమ్రాన్ స్పందించారు. 

Similar News