దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రధాని మోడీ చెప్పినట్లు నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. మోడీ ప్రోద్భలంతోనే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించిందని కేజ్రీవాల్ తెలిపారు. మోడీ ర్యాలీలు ఉన్నందునే రాత్రి పది గంటల తర్వాత ఈసీ ప్రచారాన్ని నిషేధించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసిన మోడీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.