అందరి చూపు నిజామాబాద్ వైపే...ఇప్పటిదాకా ఒక్క రైతు మాత్రమే నామినేషన్ను...
నిజామాబాద్ లోక్సభ స్థానంలో నామినేషన్ల ఉపసంహరణపై ఉత్కంఠ నెలకొంది. మరో గంటలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఇప్పటిదాకా నల్లా వినోద్ అనే రైతు మాత్రమే నామినేషన్ను విత్ డ్రా చేసుకున్నారు. మధ్యాహ్నం 3గంటల్లోపు ఇంకెంత మంది రైతులు ఉపసంహరించుకుంటారో తేలనుంది. ఎవరూ విత్ డ్రా చేయకుంటే బ్యాలెట్ పోరు తప్పదు. దీంతో నిజామాబాద్లో నామినేషన్ల ఉపసంహరణ వ్యవహారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.