నౌహీరాషేక్‌‌ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

Update: 2019-01-29 07:08 GMT

హీరా గ్రూప్‌ ప్రమోటర్‌ నౌహీరా షేక్‌ను సైబరాబాద్‌ పోలీసులు ఎల్బీనగర్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. తాను డిపాజిట్‌లు సేకరించిన మాట నిజమేనంటూ అంగీకరించిన నౌహీరా డిపాజిట్ దారులందరికీ డబ్బు చెల్లిస్తానంటూ తెలిపారు. ఎవరినీ మోసం చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. తనపై కేసులు పెట్టిన వారిలో ఒక్కరూ కూడా డిపాజిట్‌దారులు లేరన్నారు. తనపై కావాలనే కొందరు కుట్రలు చేస్తున్నారంటూ నౌహీరా షేక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

Similar News