నేడు మాజీ సీఎం, తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఏపీ మాజీమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై నారా లోకేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓటమికి పదిశాతం ఈవీఎంలు కారణమైతే, 90 శాతం నాయకులే కారణమని చంద్రబాబు అన్నారు. అసలు గల్లా జయదేవ్ వంటి నేతలే గెలవంగా మిగతావారు ఎందుకు ఓడిపోయారని అసహనం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో నారాలోకేశ్ మాట్లాడారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై పార్టీ నేతలతో చర్చించారు. కాగా ఏపీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ కేవలం 23 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న విషయం తెలిసిందే.