టీడీపీకి మరో షాక్...జనసేనలో చేరిన సీనియర్ ఎంపీ

Update: 2019-03-20 15:50 GMT

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు తనకు టిక్కెట్‌ ఇస్తారని భావించినా చివరికి వేరొకరిటి సీటు ఇవ్వడంతో ఎస్పీవై రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ తనను మోసం చేసిందని భావించిన ఆయన తొలుత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఎస్పీవై రెడ్డికి జనసేన నుండి ఆహ్వానం అందడంతో ఆ పార్టీ అధినేత పవన్‌తో మంతనాలు జరిపారు. అనంతరం జనసేన కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి జనసేన తరపున నంద్యాల ఎంపీగా పోటీచేసే అవకాశముందని తెలుస్తోంది. గత 2014 ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ టికెట్‌పై ఎస్పీవై రెడ్డి గెలిచారు. తర్వాత నెలకొన్న పరిణామాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కానీ ఈసారి మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్పీవైకి భారీ షాక్ ఇచ్చారు. ఎస్పీవైకి కాకుండా నంద్యాల ఎంపీ టిక్కెట్‌ను మాండ్ర శివానంద్‌రెడ్డికి కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైనా ఎస్పీవై పార్టీ వీడిన విషయం తెలిసిందే.

Similar News