కొత్త మంత్రులకు వైసీపీ అధిష్టానం నుంచి ఫోన్లు...బుగ్గన, బొత్స, పెద్దిరెడ్డి...
రేపు ఉదయం ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రులకు వైసీపీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కాబోయే మంత్రులకు కాల్స్ చేసి తీపి కబురు అందిస్తున్నారు. ఇప్పటికే చీపురుపల్లి ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గౌతమ్రెడ్డి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరితకు ఫోన్లు వచ్చాయి. దీంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిగతావారికి కూడా విజయసాయిరెడ్డి నుంచి ఫోన్లు వస్తున్నాయి.